విజయవాడ:అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు 50లక్షల పరిహారం

- August 09, 2020 , by Maagulf
విజయవాడ:అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు 50లక్షల పరిహారం

అమరావతి:విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. సంఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోగా.. ఇప్పుడు మృతుల సంఖ్య 11కి చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆ కోవిడ్ సెంటర్ లో చికిత్స పొందుతున్న వారిని పలు ఆస్పత్రులకు తరలించారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన ఏపీ సీఎం..ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com