కోజికోడ్ ప్రమాదంపై దిగ్భ్రాంతి..బాధితుల కుటుంబాలకు క్రికెటర్ల సానుభూతి
- August 09, 2020
న్యూ ఢిల్లీ:కోడికోడ్ విమాన ప్రమాదంపై పలువురు క్రికెటర్లు విచారం వ్యక్తం చేశారు. టీమిండియా జట్టు సభ్యులతో పాటు మాజీ ఆటగాళ్లు ఘటనపై స్పందిస్తూ..బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి వేడుకుంటూ ట్వీట్లు చేశారు. కోజికోడ్ ఎయిర్ పోర్ట్ లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి గురై 18 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..ప్రమాదం తనను ఎంతో బాధించిందని, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఎయిరిండియా విమాన ప్రమాదం తనను షాక్ కు గురిచేసిందని, ప్రయాణికులు, విమాన సిబ్బంది తరపున దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు రోహిత్ శర్మ ట్వీట్ చేశారు. ఇక మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ కోజికోడ్ దుర్ఘటనలో ఆత్మీయులను కొల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణాన్ని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మరో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఘటనపై ట్వీట్ చేశారు. 2020 ప్రజల పట్ల కొద్దిగా దయ చూపించాలని వేడుకుంటూ ట్వీట్ చేశారతను. అలాగే రవిశాస్త్రీ, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, మొహమ్మద్ కైఫ్ కోజికోడ్ విమాన ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







