భారత్:64వేలకు పైగా కరోనా కేసులు

- August 09, 2020 , by Maagulf
భారత్:64వేలకు పైగా కరోనా కేసులు

న్యూ ఢిల్లీ:భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పటివరకు 21 లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 21 లక్షల 53 వేల 11 మందికి కరోనా సోకింది. వీరిలో 43,379 మంది మరణించగా 14 లక్షల 80 వేల 884 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో, 64 వేల 399మంది కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదవగా 861 మరణాలు సంభవించాయి.

కరోనా సోకిన వారి సంఖ్య ప్రకారం భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. కరోనా మహమ్మారి వల్ల యునైటెడ్ స్టేట్స్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. భారతదేశం కంటే ఎక్కువ కేసులు అమెరికా(5,149,663), బ్రెజిల్ (3,013,369)లో ఉన్నాయ. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com