విదేశాలలో చిక్కుకుపోయిన యూఏఈ వాసులకు ముఖ్య గమనిక..
- August 10, 2020
యూఏఈ: విదేశాలలో చిక్కుకున్న యూఏఈ రెసిడెన్సీ వీసాదారులు అబుధాబి విమానాశ్రయంలో దిగినట్లైతే, వారు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ (ICA) నుండి ట్రావెల్ పర్మిట్ పొందవలసిన అవసరం లేదంటూ అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం విమానయాన సంస్థలకు తెలియజేసింది. ఈ సవరించిన ప్రయాణ నియమం ఆగస్టు 11 నుండి అమల్లోకి రానుంది. యూఏఈ వెలుపల చిక్కుకొని, ఆమోదం కోసం వేచి ఉన్న ప్రవాసులకు ఇది చాలా ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వం భావించింది.
COVID-19 ముందు జాగ్రత్త చర్యల కారణంగా విదేశాలలో చిక్కుకున్న యూఏఈ నివాసితులకు ఐసిఎ అనుమతి తప్పనిసరి. దుబాయ్ రెసిడెంట్ వీసా ఉన్నవారు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిడిఆర్ఎఫ్ఎ) నుండి అనుమతి పొందాలి. అబుదాబి, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వాయిన్, రాస్ అల్ ఖైమా మరియు ఫుజైరా నుండి వీసాలు ఉన్న వారు యూఏఈ కి ప్రయాణించడానికి అనుమతి పొందడానికి ఐసిఎ యొక్క స్మార్ట్ ఛానెళ్లలో నమోదు చేసుకోవాలి. కానీ, నేడు ప్రకటించిన సవరణ ను అనుసరించి వారు అబుధాబి విమానాశ్రయానికి వస్తే ఐసిఎ అనుమతి అవసరం లేదు.
అయితే, కోవిడ్ -19 పిసిఆర్ పరీక్షతో సహా అన్ని ఇతర ప్రయాణమార్గదర్శకాలు అబుధాబి/యూఏఈ లోని ఏదైనా ఇతర విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులందరికీ తప్పనిసరి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







