విదేశాలలో చిక్కుకుపోయిన యూఏఈ వాసులకు ముఖ్య గమనిక..
- August 10, 2020
యూఏఈ: విదేశాలలో చిక్కుకున్న యూఏఈ రెసిడెన్సీ వీసాదారులు అబుధాబి విమానాశ్రయంలో దిగినట్లైతే, వారు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ (ICA) నుండి ట్రావెల్ పర్మిట్ పొందవలసిన అవసరం లేదంటూ అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం విమానయాన సంస్థలకు తెలియజేసింది. ఈ సవరించిన ప్రయాణ నియమం ఆగస్టు 11 నుండి అమల్లోకి రానుంది. యూఏఈ వెలుపల చిక్కుకొని, ఆమోదం కోసం వేచి ఉన్న ప్రవాసులకు ఇది చాలా ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వం భావించింది.
COVID-19 ముందు జాగ్రత్త చర్యల కారణంగా విదేశాలలో చిక్కుకున్న యూఏఈ నివాసితులకు ఐసిఎ అనుమతి తప్పనిసరి. దుబాయ్ రెసిడెంట్ వీసా ఉన్నవారు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిడిఆర్ఎఫ్ఎ) నుండి అనుమతి పొందాలి. అబుదాబి, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వాయిన్, రాస్ అల్ ఖైమా మరియు ఫుజైరా నుండి వీసాలు ఉన్న వారు యూఏఈ కి ప్రయాణించడానికి అనుమతి పొందడానికి ఐసిఎ యొక్క స్మార్ట్ ఛానెళ్లలో నమోదు చేసుకోవాలి. కానీ, నేడు ప్రకటించిన సవరణ ను అనుసరించి వారు అబుధాబి విమానాశ్రయానికి వస్తే ఐసిఎ అనుమతి అవసరం లేదు.
అయితే, కోవిడ్ -19 పిసిఆర్ పరీక్షతో సహా అన్ని ఇతర ప్రయాణమార్గదర్శకాలు అబుధాబి/యూఏఈ లోని ఏదైనా ఇతర విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులందరికీ తప్పనిసరి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!