ఏపీలో కొత్తగా 7,665 కరోనా పాజిటివ్‌ కేసులు‌, 80 మంది మృతి

- August 10, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 7,665 కరోనా పాజిటివ్‌ కేసులు‌, 80 మంది మృతి

అమరావతి:ఏ.పీ‌లో గత 24 గంటల్లో 7,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా పరీక్షల్లో 22,668 ట్రూనాట్‌ పద్ధతిలో, 24,331 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,35,525 కు చేరింది. కొత్తగా 6,924 మంది వైరస్‌ బాధితులు కోలుకుని సోమవారం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,45,636 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 87,112 యాక్టివ్‌ కేసులున్నాయి.

కరోనా వైరస్‌ బాధితుల్లో తాజాగా 80 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2116 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా పరీక్షల మార్కు 25 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 25,34,304 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com