యూఏఈ కి తిరిగొచ్చే రెసిడెంట్స్కి ఐసీఏ అనుమతి అవసరంలేదు
- August 12, 2020
నేటి నుంచి (ఆగస్ట్ 12) వలసదారులైన రెసిడెంట్స్, విదేశాల్లో చిక్కుకుపోయి వుంటే, వారు తిరిగొచ్చేందుకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసీఏ) నుంచి ప్రత్యేక అనుమతి లేకుండానే యూఏఈలోకి తిరిగి రావొచ్చు. నేషనల్ ఎమర్జన్సీ క్రౌసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్సిఇఎంఎ) అలాగై ఐసీఏ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘రెసిడెంట్స్ రిటర్న్ ప్రోగ్రాం’ పేరుతో ఈ కొత్త వెసులుబాటుని కల్పించారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సమ్మర్ హాలీడేస్ ముగిస్తున్న సమయంలో అలాగే కమర్షియల్ మరియు సోషల్ యాక్టివిటీస్ పునఃప్రారంభమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం రానుండడం గమనార్హం. అయితే, చెల్లుబాటయ్యే పీసీఆర్ కోవిడ్ 19 టెస్ట్ రిజల్ట్ తప్పక వుండాలి. అది కూడా ప్రయాణానికి 96 గంటలలోపు తీసుకున్న సర్టిఫికెట్ అయి వుండాలి. కాగా, తిరిగి వచ్చేవారికి అవసరం మేరకు పరీక్షలు నిర్వహఙంచడం, క్వారంటైన్ వంటివి వుంటాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







