ఏ.పీ లో కొత్తగా 9,597 కరోనా కేసులు నమోదయ్యాయి
- August 12, 2020
అమరావతి:ఏ.పీలో గడిచిన 24 గంటల్లో 9,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,146 కు చేరింది.తాజా పరీక్షల్లో 32,837 ట్రూనాట్ పద్ధతిలో, 24,311 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు.అలాగే 6,676 మంది బుధవారం కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు.దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,61,425 కు చేరింది.రాష్ట్రంలో ప్రస్తుతం 90,425 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో కొత్తగా 93 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2296 కు చేరింది. ఈ మేరకు ఏ.పీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 26,49,767 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







