కోజికోడ్ ఫ్లైట్ బాధితులకు ఆర్ధిక సాయం..దాతృత్వం చాటుకున్న యూఏఈ వ్యాపారవేత్త
- August 12, 2020
యూఏఈలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అల్ అదిల్ ట్రేడింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనుంజయ్ దతర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కేరళాలోని కోజికోడ్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయిన వారి కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. విమాన ప్రమాదంలో ఫ్లైట్ ను కమాండ్ చేసిన పైలట్ కెప్టెన్ దీపక్ వసంత్ సాథే మరణించిన వార్త తనను ఎంతగానో కలిచి వేసిందని ధునుంజయ్ తెలిపారు. తన నాన్న కూడా గతంలో భారత వైమానిక దళంలో విధులు నిర్వహించారని...ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో తనకు బలమైన అనుబంధం ఉందని ఆయన అన్నారు. ప్రమాద విషయం తెలియగానే బాధితులను ఎదో విధంగా ఆదుకునేందుకు తనవంతు సాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు ధనుంజయ్. అంతేకాదు..కోజికోడ్ ఎయిర్ పోర్టులో ప్రమాదానికి గురైన విమాన ప్రయాణికుల్లో ఎక్కువ మంది విజిట్ విసా గడువు ముగిసిన వారు, ఉద్యోగాలు కొల్పోయి ఆర్ధిక ఇబ్బందులతో సొంతూళ్లకు బయల్దేరిన వారేనని ఆయన అన్నారు. అసలే ఆర్ధికంగా ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న వారి కుటుంబాలు..ఇంటి పెద్ద దిక్కును కొల్పోవటం ఎవరూ పూడ్చలేని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి తనకు చేతనైనంత సాయం అందిస్తున్నానని వ్యాపారవేత్త ధనుంజయ్ చెప్పారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







