ఖతార్ పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్..ఆగస్ట్ 23 నుంచి ఆన్ లైన్ ఎన్ రోల్మెంట్
- August 12, 2020
దోహా:కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఖతార్..ఇక స్కూల్స్ ప్రారంభంపై ఫోకస్ చేసింది.ఖతార్ పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్ ను ప్రారంభించింది.స్కూల్స్ లో అడ్మిషన్ కావాలన్నా..ట్రాన్స్ ఫర్ కావాలన్నా ఈ నెల 23 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సూచించింది. పబ్లిక్ స్కూల్స్ లో తమ పిల్లలకు అడ్మిషన్ కావాలనుకునే తల్లిదండ్రలు పబ్లిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఎన్ రోల్మెంట్ ప్రాసెస్ ను పూర్తి చేయాలి. దరఖాస్తు పూర్తి చేయటానికి అప్లికేషన్ తో పాటు మెడికల్ సర్టిఫికెట్ అలాగే అడ్మిషన్ కు అవసరమైన సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్స్ విద్యార్ధి అర్హుడో కాదో నిర్ధారించేందుకు గుర్తింపు పొందిన హెల్త్ సెంటర్ల నుంచి తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాలని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!
- అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో ఫౌంటెన్ తిరిగి ప్రారంభం..!!
- అమెరికా వెళ్లే.. ఖతార్ ఫుట్బాల్ అభిమానుల కోసం గైడ్ లైన్స్ జారీ..!!
- వాట్సాప్ ఫేక్ కాల్స్కు ఇక ఫుల్ స్టాప్!
- తెలంగాణ ప్రజలకు బిగ్అలర్ట్..









