సిటిజన్స్, రెసిడెన్సీలపై ట్రాఫిక్ ఫైన్స్ ప్రచారాన్ని ఖండించిన అంతర్గత మంత్రిత్వశాఖ
- August 13, 2020
కువైట్: ట్రాఫిక్ చట్టాన్ని అనుసరించి పౌరులు, ప్రవాసీయులపై జరిమానాలు విధించారన్న ప్రచారాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఖండించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై జరిమానాలు విధించారంటూ ఇటీవలె సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని ఉద్దేశించి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. ప్రస్తుతం తమ అధికారిక వెబ్ సైట్ ను అప్ డేట్ చేస్తున్నామని..అందువల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన విజువల్స్ తమకు అందుబాటులో లేవని కూడా స్పష్టం చేసింది. ఏదైనా విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేటప్పుడు సంబంధిత అధికారిక వర్గాల నుంచి కన్ఫమ్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖలోని పౌరసంబంధాలు, భద్రతా వ్యావహారాల సాధారణ విభాగం అధికారులు సూచించారు. ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు తము ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!