సిటిజన్స్, రెసిడెన్సీలపై ట్రాఫిక్ ఫైన్స్ ప్రచారాన్ని ఖండించిన అంతర్గత మంత్రిత్వశాఖ

- August 13, 2020 , by Maagulf
సిటిజన్స్, రెసిడెన్సీలపై ట్రాఫిక్ ఫైన్స్ ప్రచారాన్ని ఖండించిన అంతర్గత మంత్రిత్వశాఖ

కువైట్: ట్రాఫిక్ చట్టాన్ని అనుసరించి పౌరులు, ప్రవాసీయులపై జరిమానాలు విధించారన్న ప్రచారాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఖండించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై జరిమానాలు విధించారంటూ ఇటీవలె సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని ఉద్దేశించి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. ప్రస్తుతం తమ అధికారిక  వెబ్ సైట్ ను అప్ డేట్ చేస్తున్నామని..అందువల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన విజువల్స్ తమకు అందుబాటులో లేవని కూడా స్పష్టం చేసింది. ఏదైనా విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేటప్పుడు సంబంధిత అధికారిక వర్గాల నుంచి కన్ఫమ్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖలోని పౌరసంబంధాలు, భద్రతా వ్యావహారాల సాధారణ విభాగం అధికారులు సూచించారు. ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు తము ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com