తెలంగాణ:ఇరిగేషన్ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులు..
- August 13, 2020
తెలంగాణ:ఇరిగేషన్ శాఖను పునర్వ్యస్థీకరించి జలవనరుల శాఖగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆయా శాఖ అధికారులతో మంతనాలు జరుపుతోంది. ఈ కొత్త విధానంలో చీఫ్ ఇంజనీర్లకు (సీఈ) ప్రత్యేక అధికారాలను కల్పించనున్నారు. ప్రధాన నగరాలను ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించి, ఒక్కో ప్రాంతానికి ఒక్కో సీఈని నియమించనున్నారు.
ఆ ప్రాంత పరిధిలోని ఆయకట్టు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాల్వలు, బ్యారేజీలు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అన్నింటినీ సీఈలు పర్యవేక్షిస్తారు. వీటిల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్ లను ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు కొత్త ప్రాజెక్టులు నిర్మించారు. మరి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.
ఇవి కూడా పూర్తయితే రాష్ట్రంలో దాదాపు 1.25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు. అయితే ఈ మేరకు శాఖను పటిష్టం చేయాలని సీఎం నిర్ణయించారు. అందులో భాగంగా భారీగా కొత్త పోస్టులను కూడా సృష్టించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 24 సీఈ పోస్టులున్నాయి. మరో 7 సీఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. అలాగే అవసరమైన మేరకు రెండు వేల వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టుల నియామకానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కొత్తగా ఏఈఈలు, ఏఈలు వంటి 576 పోస్టులను కూడా నియమించనున్నారు.
తాజా వార్తలు
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు
- IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్హౌస్కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!









