బిచ్చం అడిగితే జరిమానా, జైలు శిక్ష తప్పవని హెచ్చరించిన ఒమన్
- August 13, 2020
మస్కట్:ఒమన్ లో బిచ్చం ఎత్తుకోవటం నిషేధమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. మసీదులు, స్టోర్స్, షాపింగ్ మాల్స్ తో పాటు ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో ఎవరైనా డబ్బులు యాచిస్తే వారికి ఏడాది జైలు శిక్ష, omr100 జరిమానా తప్పదని హెచ్చరించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎవరైనా పబ్లిక్ ప్రాంతాల్లో బిచ్చం ఎత్తుకుంటే జైలు, జరిమానాతో పాటు వారి దగ్గర ఉన్న సొమ్మును కూడా జప్తు చేస్తామని, శిక్షా కాలం పూర్తైన తర్వాత ఆ వ్యక్తిపై దేశబహిష్కరణ విధిస్తామని హెచ్చరించింది. ఒకవేళ బిచ్చం ఎత్తుకునే వ్యక్తి మైనర్ అయినా..మైనర్ తో కలిసి యాచించిన మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే మైనర్ తో బలవంతంగా బిచ్చం ఎత్తుకునేలా చేస్తే వారికి శిక్ష రెట్టింపు అవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని పౌరులు, ప్రవాసీయులు జాగ్రత్తగా మసులుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







