బిచ్చం అడిగితే జరిమానా, జైలు శిక్ష తప్పవని హెచ్చరించిన ఒమన్
- August 13, 2020
మస్కట్:ఒమన్ లో బిచ్చం ఎత్తుకోవటం నిషేధమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. మసీదులు, స్టోర్స్, షాపింగ్ మాల్స్ తో పాటు ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో ఎవరైనా డబ్బులు యాచిస్తే వారికి ఏడాది జైలు శిక్ష, omr100 జరిమానా తప్పదని హెచ్చరించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎవరైనా పబ్లిక్ ప్రాంతాల్లో బిచ్చం ఎత్తుకుంటే జైలు, జరిమానాతో పాటు వారి దగ్గర ఉన్న సొమ్మును కూడా జప్తు చేస్తామని, శిక్షా కాలం పూర్తైన తర్వాత ఆ వ్యక్తిపై దేశబహిష్కరణ విధిస్తామని హెచ్చరించింది. ఒకవేళ బిచ్చం ఎత్తుకునే వ్యక్తి మైనర్ అయినా..మైనర్ తో కలిసి యాచించిన మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే మైనర్ తో బలవంతంగా బిచ్చం ఎత్తుకునేలా చేస్తే వారికి శిక్ష రెట్టింపు అవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని పౌరులు, ప్రవాసీయులు జాగ్రత్తగా మసులుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు
- IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్హౌస్కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!









