ఉగ్రమూక స్వాధీనంలో మొజాంబిక్ పోర్టు
- August 14, 2020ఆఫ్రికాలో కీలకమైన మొజాంబిక్లోని పోర్ట్ ఆఫ్ మొసిమ్బోవాను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆక్రమించారు. ఈ ఘటన ఆఫ్రికాలో పెను సంచలనం సృష్టించింది. ఈ పోర్టుకు అత్యంత సమీపంలోనే దాదాపు 60 బిలియన్ డాలర్ల విలువైన భారీ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. కొన్నాళ్ల నుంచి ఇక్కడ పోర్టు కోసం భీకర పోరాటం సాగుతోందని మొజాంబిక్ భద్రతా దళమైన ఎఫ్డీఎస్ వెల్లడించింది. ఈ పోర్టు మొజాంబిక్ ప్రభుత్వం చేతిలో నుంచి ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లడం ఊహించని దెబ్బగా భావిస్తున్నారు. ఈ పోరులో భారీ సంఖ్యలో సైనికులు చనిపోగా.. మరోపక్క 59 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఒక పెట్రోల్ బోటును ముంచేశాయి. అక్కడ ప్రజలను కవచాలుగా పెట్టుకొని ఉగ్రవాదులు పోరాడుతున్నారని సైనికాధికారులు వెల్లడించారు.
ఈ పోర్టుకు దాదాపు 40 మైళ్ల దూరంలో ఉన్న అతిపెద్ద గ్యాస్క్షేత్రాన్ని ఫ్రాన్స్కు చెందిన టోటల్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇటీవల కాలంలో పోర్టు చుట్టుపక్కల నగరాలను ఇస్లామిక్ స్టేట్ సంస్థ ఆక్రమిస్తూ వస్తోంది. ఈ పోర్టు కోసం పలు మార్లు దాడులు చేసిన ఐఎస్ తాజాగా విజయం సాధించింది. మొజాంబిక్ భద్రతా దళాలు తీవ్రమైన ఆయుధ కొరతతో ఉండటాన్ని అదునుగా భావించి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఇక్కడ ఇస్లామిక్ స్టేట్ తరఫున అహ్లు సున్నాహ్ వా జమా సంస్థ పనిచేస్తోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ