ఉగ్రవాదుల బీభత్సం, కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి
- August 14, 2020
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. శ్రీనగర్ శివారులోని నౌగామ్ ప్రాంతంలో పోలీసుల కాన్వాయ్పై కాల్పులు జరిపారు. పోలీసులు తేరుకొనే లోపే బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడి నుంచి పరారయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన PCR హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులను ఇస్ఫాఖ్ ఆయుబ్ (715 IRP 20 బెటాలియన్), ఫయాజ్ అహ్మద్ (307 IRP 20 బెటాలియన్)గా గుర్తించారు. సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ మహమ్మద్ అష్రాఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- దోహాలో బిజినెస్ మీట్లో పాల్గొన్న ఏపీ మంత్రి పార్థసారథి
- 'ఇన్నర్ టెంపుల్' గౌరవ సభ్యుడిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు
- బహ్రెయిన్లో ప్రమాదానికి గురైన భారతీయ మహిళ స్వదేశానికి తరలింపు
- ఖతార్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు
- విమానాలలో పవర్ బ్యాంక్లపై సౌదీ అరేబియా నిషేధం..!!
- కువైట్లో ఎబోలా కేసులు లేవు..సరిహద్దుల వద్ద గట్టి భద్రత..!!
- బహ్రెయిన్ లో ప్రవాసుల కోసం వైద్య శిబిరం..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. ఖతార్, జోర్డాన్ కీలక చర్చలు..!!
- హోర్ముజ్లో ఇరాన్కు కొత్త అధికారాన్ని తిరస్కరించిన గల్ఫ్ దేశాలు..!!
- అభివృద్ధికి మద్దతు..ఒమన్ లో కొత్త పట్టణ ప్రణాళిక చట్టం..!!









