ఉగ్రవాదుల బీభత్సం, కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి

- August 14, 2020 , by Maagulf
ఉగ్రవాదుల బీభత్సం, కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. శ్రీనగర్‌ శివారులోని నౌగామ్ ప్రాంతంలో పోలీసుల కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. పోలీసులు తేరుకొనే లోపే బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడి నుంచి పరారయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన PCR హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులను ఇస్ఫాఖ్ ఆయుబ్ (715 IRP 20 బెటాలియన్), ఫయాజ్ అహ్మద్ (307 IRP 20 బెటాలియన్)గా గుర్తించారు. సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ మహమ్మద్ అష్రాఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com