అకామడేషన్స్లో తనిఖీలు కొనసాగుతాయ్
- August 14, 2020
మనామా:సదరన్ గవర్నరేట్, లేబర్ అకామడేషన్లలో తనిఖీల్ని కొనసాగించనున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఎప్పటికప్పుడు విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గవర్నరేట్కి చెందిన ఇంజనీరింగ్ సర్వీసెస్ అలాగే ఇన్వెస్టిమెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇంజనీర్ ఖాలిద్ అబ్దుల్లతీఫ్ హాజి నేతృత్వంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, సదరన్ ఏరియా మునిసిపాలిటీ అలాగే ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ సంయుక్తంగా ఈ తనిఖీల్ని నిర్వహించడం జరుగుతోంది. హాజి వెల్లడించిన వివరాల ప్రకారం 16 యూనిట్లను ఇప్పటికే తనిఖీలు చేశారు. ఉల్లంఘనులపై చర్యలు కూడా తీసుకున్నారు. క్రౌడ్ హౌసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు హాజి వివరించారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







