హీరో సాయితేజ్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ కొత్తచిత్రం
- August 14, 2020కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ కథానాయకుడిగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. భారీ హిట్ చిత్రాలకు కేరాఫ్ అయిన శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, వైవిధ్యమైన కథాంశాలను ప్రాధాన్యమిచ్చే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై స్టార్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్.ప్రసాద్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు.
ఈ పోస్టర్లో ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతిః సింహరాశౌ స్థిత నమయే, అంతిమ పుష్కరే’ అని సంస్కృతంలోని వాక్యంతో పాటు షట్చక్రంలో ఓ కన్ను చూపిస్తున్నారు. అసలు ఈ కన్ను, షట్చక్రం, సంస్కృత వాక్యం వెనకున్న కథేంటనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. మిస్టీక్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రచన శాఖలో పనిచేసిన కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…