బీరుట్కు భారత్ మానవతా సాయం
- August 14, 2020
బీరుట్ పేలుడు విషయంలో లెబనాన్కు భారత్ సంఘీభావం తెలుపుతోందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. కీలకమైన వైద్య, ఆహార సామాగ్రితో సహా 58 మెట్రిక్ టన్నుల అత్యవసర మానవతా సహాయాన్ని బీరుట్కు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐఎఎఫ్ సి 17 విమానంలో సహాయ సామాగ్రి బీరుట్కు వెళ్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 4 న లెబనీస్ రాజధాని ఓడరేవులో ఘోరమైన పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లలో 158 మంది మరణించగా 6 వేల మందికి పైగా గాయపడ్డారు. నగరంలోని సగం మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.
ఒక బిలియన్ డాలర్ల మేర నష్టం వాటినట్లు అంచనా. లెబనీస్ ప్రభుత్వం ప్రకారం రక్షణ నియమాలను ఉల్లంఘించి 2,750 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ను 2014 నుంచి నిల్వ ఉంచడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లుగా పేర్కొంది. అంతకుక్రితం ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ... బీరుట్ అనంతరం పరిస్థితిని ఎదుర్కోనేందుకు లెబనాన్కు భారత్ సహాయంగా ఉండనున్నట్లు తెలిపారు. మరింత సహాయ సామాగ్రిని పంపనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







