సమాజానికి కొత్త మెసేజ్ ఇచ్చే 'సైకో'
- August 14, 2020
లావణ్య సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బానర్ పై ఆవుల రాజు యాదవ్, వాసు సంకినేని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సైకో'. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం ద్వారా కార్తీక్ సాయి హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ మిస్ కాకుండా రిచ్ గా సినిమాను రూపొందిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఇక కథ విషయానికి వస్తే ఓ కొత్త పాయింట్ కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి దర్శకుడు చిత్రీకరిస్తున్న విధానం బాగుందని, ఈ చిత్రం సమాజానికి ఓ కొత్త మెసేజ్ ఇస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కథ, కథనమే ప్రధాన బలమని చిత్ర దర్శకుడు కార్తీక్ సాయి అంటున్నారు.
ఈ 'సైకో' చిత్రంలో హీరోగా కార్తీక్ సాయి, ఫిమేల్ లీడ్ రోల్స్ లో డాలి షా, నేహా దేశ్ పాండే నటిస్తుండగా..సీవిఎల్ నరసింహ, సంధ్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్ గా ఆర్యన్, మ్యూజిక్ డైరెక్టర్ గా సిద్దార్ వాట్కిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తోట సతీష్, లైన్ ప్రొడ్యూసర్ గా ప్రియా, సంతోష్ కుమార్ పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?