ఆన్ లైన్లో కోవిడ్-19 పరీక్ష ఫలితాన్ని ఇలా తెలుసుకోవచ్చు
- August 15, 2020
అమరావతి: ఏ.పీ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా కోవిడ్ టెస్ట్ కోసం రిక్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కోవిడ్ పరీక్ష ఫలితాలను కూడా ఆన్ లైన్లో అందుబాటులోకి తెచ్చింది.
మొన్నటి వరకు ఫలితం వచ్చినా కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచో, ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ వచ్చే వరకు తెలిసేది కాదు. ఇప్పుడు అలా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ కరోనా టెస్ట్ రిజల్ట్స్ మీరు కూడా తెలుసుకోవచ్చు.
దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఏపీలో కోవిడ్ టెస్టులు చేయించుకున్నవారు వారికి ఇచ్చిన శాంపిల్స్ నెంబర్ లేదా అధార్ కార్డు నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ఉపయోగించి ఈ క్రింద లింక్ను క్లిక్ చేసి http://dashboard.covid19.ap.gov.in/ims/knowSampleStatus/ టెస్టు రిజల్ట్స్ను తెలుసుకోవచ్చు.
కోవిడ్ టెస్టు రిజల్ట్స్ ఆలస్యంగా వస్తున్నాయన్న విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త వెబ్సైట్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







