ఆన్ లైన్లో కోవిడ్-19 పరీక్ష ఫలితాన్ని ఇలా తెలుసుకోవచ్చు
- August 15, 2020
అమరావతి: ఏ.పీ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా కోవిడ్ టెస్ట్ కోసం రిక్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కోవిడ్ పరీక్ష ఫలితాలను కూడా ఆన్ లైన్లో అందుబాటులోకి తెచ్చింది.
మొన్నటి వరకు ఫలితం వచ్చినా కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచో, ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ వచ్చే వరకు తెలిసేది కాదు. ఇప్పుడు అలా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ కరోనా టెస్ట్ రిజల్ట్స్ మీరు కూడా తెలుసుకోవచ్చు.
దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఏపీలో కోవిడ్ టెస్టులు చేయించుకున్నవారు వారికి ఇచ్చిన శాంపిల్స్ నెంబర్ లేదా అధార్ కార్డు నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ఉపయోగించి ఈ క్రింద లింక్ను క్లిక్ చేసి http://dashboard.covid19.ap.gov.in/ims/knowSampleStatus/ టెస్టు రిజల్ట్స్ను తెలుసుకోవచ్చు.
కోవిడ్ టెస్టు రిజల్ట్స్ ఆలస్యంగా వస్తున్నాయన్న విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త వెబ్సైట్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా సందర్భంగా అబూదాబిలో ఉచిత పార్కింగ్, డార్బ్ టోల్ మినహాయింపు
- సలాలా ఎయిర్పోర్టుకు తొలి ఎతిహాద్ విమానం
- దుబాయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల్లో పెంపు లేదు
- ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి
- బీడీ ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి!
- 8,000 కొత్త ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్!
- తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్ లో 8500 దాటిన ఫ్రీ, రాయితీ ప్రైవేట్ స్కూల్స్ సీట్లు..!!









