దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..
- August 15, 2020
దుబాయ్:దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు భారత కాన్సుల్ జనరల్ డా.అమన్ పూరి జాతీయ జెండాను ఎగురవేశారు. మహమ్మారి కోవిడ్ నేపథ్యంలో ఈసారి ఈ కార్యక్రమానికి పబ్లిక్ను అనుమతించలేదు. కేవలం కార్యాలయం సిబ్బంది, అధికారులు మాత్రమే హాజరయ్యారు. దీంతో దుబాయ్ లోని భారత ప్రవాసులు ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కాన్సులేట్ ఆఫ్ ఇండియా అధికారిక సోషల్ మీడియా లో ప్రవాసుల కోసం ఈ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుబాయ్ కి చెందిన ప్రముఖ గాయకుడు సూరజ్ భారతి దేశభక్తి గీతం పాడగా, ఒక నృత్య బృందం వేదిక వద్ద శాస్త్రీయ నృత్యాలు చేసింది.
అనంతరం కాన్సుల్ జనరల్ డా.అమన్ పూరి ఈ సభలో ప్రసంగించారు. భారతీయ సమాజంలోని సభ్యులు, మా ఎమిరాటి స్నేహితులు,దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు ప్రత్యేకంగా స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!