కువైట్:క్షమాభిక్ష వినియోగించుకోని 1,20,000 మంది ప్రవాసీయులు
- August 16, 2020
కువైట్ సిటీ:వీసా గడువు ముగిసిన ప్రవాసీయులు కువైట్ లో ఇంకా 1,20,000 మంది ఉన్నారని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వీసా గడువు ముగిసినా..ఎలాంటి జరిమానా చెల్లించకుండా ఉచితంగా స్వదేశాలకు వెళ్లేలా కువైట్ ప్రభుత్వం ప్రవాసీయులు అవకాశం కల్పించింది. అయితే..ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోని ప్రవాసీయులు దేశంలో లక్ష 20 వేల మంది ఉన్నట్లు లెక్క తేల్చింది. వాళ్లందర్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా
హెచ్చరించింది. రెసిడెన్సీ వీసా నిబంధనలు ఉల్లంఘించి అనుమతించిన గడువుకు మించి దేశంలో ఉన్న ప్రవాసీయులందర్ని అరెస్ట్ చేస్తామని, అలాగే గడువు దాటి అదనంగా ఉన్న రోజులకు ఒక్కరికి గరిష్టంగా KD 600 జరిమానా విధిస్తామని వెల్లడించింది. క్షమాభిక్ష అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని ప్రవాసీయులపై దేశ బహిష్కరణ విధిస్తామని..వాళ్లు స్వదేశాలకు వెళ్లేందుకు స్పాన్సర్లే విమాన ఛార్జీలు భరించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. అయితే..క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోని వారిలో ఎక్కువ మంది కార్మికులే ఉన్నారని, వాళ్లంతా వీసా ట్రేడర్స్ మోసాలతో కువైట్ వీధుల్లో వదిలివేయబడినవారే.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







