ఒమన్ లో తగ్గిన ప్రవాసీయుల సంఖ్య
- August 17, 2020
మస్కట్:ఒమన్ లో ప్రవాసీయుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గత నెల రోజులుగా 96 వేల మంది ఒమన్ నుంచి వెళ్లిపోయినట్లు జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం ప్రకటించింది. ఒమనైజేషన్ ప్రభావంతో ఒమన్ స్వదేశీయులతో విదేశీల నిష్పత్తి తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15, 2020 నాటికి జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఒమన్ జనాభాలో ఒమనీయుల సంఖ్య 60.60 శాతంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం ఒమనీయుల సంఖ్య 27,28,724 మంది ఉన్నారు. ఇక ప్రవాసీయుల జనాభా 39.40 (17,75,577) శాతం ఉన్నట్లు ఎన్సీఎస్ఐ స్పష్టం చేసింది. ఇదిలాఉంటే జులై 21 నాటికి ప్రవాసీయుల సంఖ్య 18,72,170 (40.08శాతం) మంది ఉన్నట్లు వెల్లడించింది. అంటే ఈ ఒక్క నెలలోనే 96 వేల మంది ప్రవాసీయులు ఒమన్ విడిచి వెళ్లినట్లు ఎన్సీఎస్ఐ ప్రకటించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







