3 మిలియన్ దిర్హామ్ లు దోచుకున్న 8 మంది సభ్యుల గ్యాంగ్
- August 17, 2020
యూఏఈ:ఆఫ్రికా మరియు ఆసియా జాతీయులైన 8 మంది సభ్యుల ముఠా, ఓ వ్యక్తిని కొట్టి అతని దగ్గర్నుంచి 3,585,000 దిర్హామ్ లను దోచుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడు, డబ్బుని డాలర్ల రూపంలో ట్రేడ్ చేయడం కోసమని బ్యాగులో పెట్టుకుని అల్ నహ్దా వైపుగా ఓ కార్యాలయానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు పక్కా వ్యూహంతో బాధితుడిపై దాడి చేసి, అతని నుంచి డబ్బు లాక్కుని, అక్కడినుంచి పారిపోయారు. అనంతరం, బాధితుడు సీఐడీ ఆఫీసర్కి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







