సంపత్నంది కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్తో కె.కె.రాధామోహన్ కొత్త చిత్రం
- August 17, 2020
హైదరాబాద్:ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంబించారు. ఈ చిత్రం గురించి నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ``మా బ్యానర్లో ఏమైంది ఈవేళ, బెంగాల్టైగర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు సంపత్నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా అనిపించింది. కథ బాగా నచ్చడంతో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ ఫస్ట్వీక్ నుండి నాన్స్టాప్గా షూటింగ్ జరుగుతుంది. సంపత్నంది అసోసియేట్ డైరెక్టర్ అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించి ప్రముఖ నటీనటుల ఎంపిక జరుగుతుంది. అనూప్ క్రియేటివ్స్ సంగీతం అందిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ప్రవీణ్ అనుమోలు,
సంగీతం: అనూప్ క్రియేటివ్స్,
సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్,
నిర్మాత: కె.కె. రాధామోహన్,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సంపత్నంది,
దర్శకత్వం: అశోక్ తేజ.

తాజా వార్తలు
- ఏపీలో కొత్తగా 1,050 ఎలక్ట్రిక్ బస్సులు
- అమెరికా-ఇరాన్ అణు డీల్ ఖరారు..
- ఐపీఎల్ తరహాలోనే హోరాహోరీ..జూన్ 20 నుంచి లీగ్ షురూ!
- శ్రీ శ్రీ రవిశంకర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
- అత్యంత వైభవంగా NATS సాంస్కృతిక సంబరాలు
- వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం- 15- 30 రౌండ్ల ఫైరింగ్
- నిరుద్యోగులకు గేట్స్ కళాశాల బంపర్ ఆఫర్!
- లక్కీ డ్రా విజేత సంఖ్యలను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- ఈద్ నేపథ్యంలో కువైట్ ఫుడ్ అథారిటీ వార్నింగ్..!!
- ఈద్ అల్ అదా.. 4 ఎమిరేట్లలో ఫ్రీ పార్కింగ్..!!









