ఐపీఎల్ 2020: స్పాన్సర్ షిప్ టైటిల్ గెల్చుకున్న డ్రీమ్ 11
- August 18, 2020
ఫాంటరీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ని గెల్చుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. 222 కోట్ల రూపాయలతో ఈ టైటిల్ని డ్రీమ్ 11 సొంతం చేసుకుంది. ఆగస్ట్ 10న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ), స్పాన్సర్ షిప్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానించడం జరిగింది. చైనా - భారత్ మధ్య తలెత్తిన సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో చైనాకి చెందిన వివో సంస్థ, స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా జరగనున్న విషయం విదితమే. కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్ పోటీలు ఇండియాలో కాకుండా యూఏఈలో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం