రియాద్ లో ఈ-ఆంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా
- August 19, 2020
రియాద్:రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలబెట్టేందుకు గోల్డెన్ ఆవర్స్ లో చికిత్స అందించటం అతి ముఖ్యం. గోల్డెన్ ఆవర్స్ లో అతి వేగంగా స్పందించేందుకు వీలుగా సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ-ఆంబులెన్స్ సేవలను రియాద్ లో ప్రారంభించింది. ఈ ఎలక్ట్రానిక్ ఆంబులెన్స్ సర్వీసులతో ఇప్పటికంటే మరింత వేగంగా స్పందించి బాధితులకు వైద్య సేవలు అందించేందుకు వీలు కలగనుంది. 'ఎలక్ట్రానిక్ మెడిక్ సిస్టమ్' పేరుతో సేవలు అందించే ఈ-ఆంబులెన్స్ సర్వీసులను రియాద్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బాందర్ బిన్ అబ్దులాజీజ్ తన కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ విధానంలో ఈ-ఆంబులెన్స్ కు 91 ఆస్పత్రులకు లింక్ అయి ఉంటుంది. ఒక్కసారి బాధితులను నుంచి వినతులు అందిన క్షణాల్లో 91 కేంద్రాలకు సమాచారం అందుతుంది. దీంతో సమీపంలో ఉండే వైద్య కేంద్రాల నుంచి ఆంబులెన్స్ లు బాధితుల దగ్గరికి చేరుకుంటాయి. అంతేకాదు..ముందే పొందుపర్చిన వివరాలతో బాధితులను వీలైనంత త్వరగా చేరే దగ్గరి మార్గాలను కూడా ఎలక్ట్రానిక్ మెడిక్ సిస్టమ్ సూచిస్తుంది. ఆంబులెన్స్ సిబ్బందిని అప్రమత్తం చేసి, బాధితులకు అవసరమైన వైద్య సామాగ్రిని వేగంగా సమకూర్చుకునేలా హెచ్చరిస్తుంది.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!