సమ్మర్ డొనేషన్ డ్రైవ్ కొనసాగిస్తున్న ఐసీఆర్ఎఫ్
- August 19, 2020
బహ్రెయిన్: ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్ఎఫ్), 400 మందికి పైగా వర్కర్స్కి వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్, బిర్యానీతో కూడిన లంచ్ బాక్స్లను పంపిణీ చేసింది. భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సనద్ వద్ద అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ వర్క్ సైట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీఆర్ఎఫ్ వాలంటీర్లు, ఫేస్ మాస్కులు అలాగే యాంటీ బాక్టీరియల్ సోప్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన ఫ్లయర్స్ని కూడా పంపిణీ చేశారు. సమ్మర్ నేపథ్యంలో ఎండ దెబ్బ తగలకుండా తగినంత నీటిని వర్కర్స్ తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని ఐసీఆర్ఎఫ్ పేర్కొంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







