ఏపీలో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదు

- August 19, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదు

అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో 57,685 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,742 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16003కు చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 8,061 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, 86 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 30,19,296 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com