రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో వర్క్ మినిస్టర్ తనిఖీ
- August 19, 2020
మనామా:వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇంజనీర్ ఇస్సా మ్ ఖలాఫ్, అల్ లాజ్వి హౌసింగ్ డెవలప్మెంట్ వైపుగా వెళ్ళే రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో తనిఖీలు నిర్వహించారు. జూన్లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు విలువ 5.1 మిలియన్ బహ్రెయినీ దినార్లు. హమాద్ టౌన్లో ఈ ప్రాజెక్టు చేపట్టారు. మినిస్టర్ వెంట వర్క్స్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అహ్మద్ అల్ ఖయ్యాత్, రోడ్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ హుడా ఫాక్రో, రోడ్ ప్రాజెక్ట్స్ మరియు మెయిన్టెనెన్స్ డైరెక్టర్ సయ్యద్ బదర్ అలావి అలాగే రోడ్స్ ప్లానింగ్ మరియు డిజైన్ డైరెక్టర్ ఇంజనీర్ మహా ఖలీఫా హమాదా వున్నారు. ఈ ప్రాజెక్టు మెయిన్ రోడ్ నెట్వర్క్లో అతి కీలకమైనదనీ, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు ఈ ప్రాజెక్ట్తో చెక్ పెట్టవచ్చునని అన్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







