ఇకపై ట్యాక్సీల్లో ముగ్గురు ప్రయాణీకులకు అవకాశం
- August 19, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ట్రాఫిక్ సెక్టార్స్కి కీలకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్యాక్సీల్లో ఇకపై ముగ్గురు ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం టాక్సీల్లో ఒకే ఒక్క ప్రయాణీకుడికి అనుమతిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. కాగా, పలు ట్యాక్సీ కంపెనీలు, ప్యాసింజర్ల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఆ ఫలితంగా మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ట్రిప్లో ముగ్గురు ప్రయాణీకుల్ని ట్యాక్సీల్లో ఎక్కించుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









