ఏ.పి‌లో కొత్తగా 9,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

- August 20, 2020 , by Maagulf
ఏ.పి‌లో కొత్తగా 9,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

అమరావతి:ఏ.పి‌లో గడిచిన 24 గంటల్లో 55,551 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,393 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,25,396కు చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 8,846 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మొత్తం 2,35,218 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 95 మంది మృత్యువాత పడగా ఇప్పటి వరకు 3001 మంది మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ గురువారం వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 30,74,847 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.


--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com