యూఏఈ రెసిడెంట్స్కి తాజా హెచ్చరిక
- August 20, 2020
యూఏఈ:‘లీగల్ నోటిఫికేషన్’ పేరుతో వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా వేదికలపై సర్క్యులేట్ అవుతోన్న ఓ ఫేక్ నోటిఫికేషన్పై రెసిడెంట్స్ని అప్రమత్తం చేస్తున్నాయి సంబంధిత అథారిటీస్. ‘మీ బ్యాంక్ అకౌంట్ భద్రతా కారణాల రీత్యా ఫ్రీజ్ చేయబడింది. మీ పూర్తి వివరాలు వెరిఫై చేసుకోండి. లేని పక్షంలో అకౌంట్ శాశ్వతంగా సస్పెండ్ అవుతుంది’ అంటూ ఆ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 24 గంటల్లోగా ఫోన్ చేయాలంటూ ఓ ఫోన్ నెంబర్ కూడా అందులో పొందుపరుస్తున్నారు స్కామర్స్. ఈ నేపథ్యంలో యూఏఈ సెంట్రల్ బ్యాంక్, ఇతర బ్యాంకులు తమ వినియోగదారుల్ని పలుమార్లు ఇదే విషయమై అప్రమత్తం చేయడం జరిగింది. వినియోగదారులెవరూ ఇలాంటి మెసేజ్ల పట్ల ఆకర్షితులవ్వొద్దనీ, ఆందోళన చెందవద్దనీ, వాటిని అసలు పట్టించుకోవద్దని సూచిస్తున్నారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









