యూఏఈ రెసిడెంట్స్కి తాజా హెచ్చరిక
- August 20, 2020
యూఏఈ:‘లీగల్ నోటిఫికేషన్’ పేరుతో వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా వేదికలపై సర్క్యులేట్ అవుతోన్న ఓ ఫేక్ నోటిఫికేషన్పై రెసిడెంట్స్ని అప్రమత్తం చేస్తున్నాయి సంబంధిత అథారిటీస్. ‘మీ బ్యాంక్ అకౌంట్ భద్రతా కారణాల రీత్యా ఫ్రీజ్ చేయబడింది. మీ పూర్తి వివరాలు వెరిఫై చేసుకోండి. లేని పక్షంలో అకౌంట్ శాశ్వతంగా సస్పెండ్ అవుతుంది’ అంటూ ఆ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 24 గంటల్లోగా ఫోన్ చేయాలంటూ ఓ ఫోన్ నెంబర్ కూడా అందులో పొందుపరుస్తున్నారు స్కామర్స్. ఈ నేపథ్యంలో యూఏఈ సెంట్రల్ బ్యాంక్, ఇతర బ్యాంకులు తమ వినియోగదారుల్ని పలుమార్లు ఇదే విషయమై అప్రమత్తం చేయడం జరిగింది. వినియోగదారులెవరూ ఇలాంటి మెసేజ్ల పట్ల ఆకర్షితులవ్వొద్దనీ, ఆందోళన చెందవద్దనీ, వాటిని అసలు పట్టించుకోవద్దని సూచిస్తున్నారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







