భారత్లోని 5 నగరాలకు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ రిపాట్రియేషన్ విమానాలు
- August 21, 2020
దుబాయ్: దుబాయ్ ప్రధాన క్యారియర్ అయిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ భారతదేశంలోని 5 నగరాలకు రిపాట్రియేషన్ విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 20 నుంచి 31వ తేదీ మధ్య ఇండియాలోని బెంగళూరు, కొచ్చి, ఢిల్లీ, ముంబై, తిరువనంతపురంకు ఈ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపింది. ఈ ప్రత్యేక విమానాలు యూఏఈలోని భారత పౌరులు ఎవరైతే స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారో వారిని తరలించడానికి, అలాగే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న యూఏఈ నివాసితులు తిరిగి ఆ దేశానికి రావడానికి వీలు కల్పిస్తాయని ఈ విమానయాన సంస్థ పేర్కొంది.
ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సర్వీసుల వివరాలు...
బెంగళూరు: ఆగస్టు 21, 23, 25, 28, 30
కొచ్చి: ఆగస్టు 20, 22, 24, 27, 29, 31 (కొచ్చి నుంచి దుబాయ్కు నడిచే విమానాలు ఆగస్టు 21, 23, 25, 28, 30, సెప్టెంబర్ 1న ఉంటాయి.)
ఢిల్లీ: ఆగస్టు 31 వరకు రోజువారీ విమానాలు
ముంబై: ఆగస్టు 31 వరకు రోజువారీ విమానాలు
తిరువనంతపురం: ఆగస్టు 26 (తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్లే విమానం ఆగస్టు 27న ఉంటుంది.)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







