భారత్లోని 5 నగరాలకు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ రిపాట్రియేషన్ విమానాలు
- August 21, 2020
దుబాయ్: దుబాయ్ ప్రధాన క్యారియర్ అయిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ భారతదేశంలోని 5 నగరాలకు రిపాట్రియేషన్ విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 20 నుంచి 31వ తేదీ మధ్య ఇండియాలోని బెంగళూరు, కొచ్చి, ఢిల్లీ, ముంబై, తిరువనంతపురంకు ఈ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపింది. ఈ ప్రత్యేక విమానాలు యూఏఈలోని భారత పౌరులు ఎవరైతే స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారో వారిని తరలించడానికి, అలాగే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న యూఏఈ నివాసితులు తిరిగి ఆ దేశానికి రావడానికి వీలు కల్పిస్తాయని ఈ విమానయాన సంస్థ పేర్కొంది.
ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సర్వీసుల వివరాలు...
బెంగళూరు: ఆగస్టు 21, 23, 25, 28, 30
కొచ్చి: ఆగస్టు 20, 22, 24, 27, 29, 31 (కొచ్చి నుంచి దుబాయ్కు నడిచే విమానాలు ఆగస్టు 21, 23, 25, 28, 30, సెప్టెంబర్ 1న ఉంటాయి.)
ఢిల్లీ: ఆగస్టు 31 వరకు రోజువారీ విమానాలు
ముంబై: ఆగస్టు 31 వరకు రోజువారీ విమానాలు
తిరువనంతపురం: ఆగస్టు 26 (తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్లే విమానం ఆగస్టు 27న ఉంటుంది.)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







