శ్రీశైలం పవర్ హౌస్‌ అగ్ని ప్రమాదంపై ఎపి గవర్నర్ బిస్వ భూషణ్ హరి చందన్ తీవ్ర విచారం

- August 21, 2020 , by Maagulf
శ్రీశైలం పవర్ హౌస్‌ అగ్ని ప్రమాదంపై ఎపి గవర్నర్  బిస్వ భూషణ్ హరి చందన్ తీవ్ర విచారం

విజయవాడ:శ్రీశైలం ప్రాజెక్టు వద్ద భూగర్భ హైడెల్ పవర్ హౌస్‌లో గురువారం రాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిస్వ భూషణ్ హరిచందన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన ప్రమాదం కారణంగా ఆరుగురు ఉద్యోగులు మరణించగా, 15 మందిని రక్షించారన్నారు. పవర్‌హౌస్ లోపల చిక్కుకున్న ఆరుగురు ఉద్యోగులను రక్షించడం సాధ్యం కాని పరిస్థితిలో వారు మృతి చెందటం పట్ల  గవర్నర్  హరిచందన్ ఒక సందేశంలో విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది ఉద్యోగులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు గవర్నర్ తన సంతాపం ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com