ఒమన్ విజన్ 2040 ప్రమోట్ చేసేలా పరిపాలన విభాగంలో కొత్త నియామకాలు
- August 21, 2020
మస్కట్:మజ్లిస్ యాష్ షురా కోరుకున్నట్లు ఒమన్ ప్రభుత్వం విజన్ 2040 దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పరిపాలన విభాగంలో స్థానిక యువతను నియమిస్తూ రాయల్ డిక్రీలు వెలువడటం పట్ల మజ్లిస్ యాష్ షురా ప్రశంసలు వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పలు విభాగాల్లో నైపుణ్యం కలిగిన యువతను నియమించాలనే నిర్ణయం..ఒమన్ విజన్ 2040 లక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఉందని, ఒమన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని అభిప్రాయపడింది. మజ్లిస్ యాష్ షురా సభ్యులను పరిపాలన విభాగంలో నియమించుకోవటం..ఒమన్ పునర్నిర్మాణానికి అడుగులు పడ్డాయని పేర్కొంది. అలాగే మజ్లిస్, ప్రభుత్వం మధ్య పరస్పర అవగాహనకు దోడ్పతుందని తెలిపింది. అంతేకాదు..ప్రభుత్వంలో మహిళా మంత్రులకు, పరిపాలన విభాగంలో మహిళా అధికారులకు స్థానం కల్పించటాన్ని మజ్లిస్ కొనియాడింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!







