ఒమన్ విజన్ 2040 ప్రమోట్ చేసేలా పరిపాలన విభాగంలో కొత్త నియామకాలు
- August 21, 2020
మస్కట్:మజ్లిస్ యాష్ షురా కోరుకున్నట్లు ఒమన్ ప్రభుత్వం విజన్ 2040 దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పరిపాలన విభాగంలో స్థానిక యువతను నియమిస్తూ రాయల్ డిక్రీలు వెలువడటం పట్ల మజ్లిస్ యాష్ షురా ప్రశంసలు వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పలు విభాగాల్లో నైపుణ్యం కలిగిన యువతను నియమించాలనే నిర్ణయం..ఒమన్ విజన్ 2040 లక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఉందని, ఒమన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని అభిప్రాయపడింది. మజ్లిస్ యాష్ షురా సభ్యులను పరిపాలన విభాగంలో నియమించుకోవటం..ఒమన్ పునర్నిర్మాణానికి అడుగులు పడ్డాయని పేర్కొంది. అలాగే మజ్లిస్, ప్రభుత్వం మధ్య పరస్పర అవగాహనకు దోడ్పతుందని తెలిపింది. అంతేకాదు..ప్రభుత్వంలో మహిళా మంత్రులకు, పరిపాలన విభాగంలో మహిళా అధికారులకు స్థానం కల్పించటాన్ని మజ్లిస్ కొనియాడింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







