ఒమన్ విజన్ 2040 ప్రమోట్ చేసేలా పరిపాలన విభాగంలో కొత్త నియామకాలు
- August 21, 2020
మస్కట్:మజ్లిస్ యాష్ షురా కోరుకున్నట్లు ఒమన్ ప్రభుత్వం విజన్ 2040 దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పరిపాలన విభాగంలో స్థానిక యువతను నియమిస్తూ రాయల్ డిక్రీలు వెలువడటం పట్ల మజ్లిస్ యాష్ షురా ప్రశంసలు వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పలు విభాగాల్లో నైపుణ్యం కలిగిన యువతను నియమించాలనే నిర్ణయం..ఒమన్ విజన్ 2040 లక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఉందని, ఒమన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని అభిప్రాయపడింది. మజ్లిస్ యాష్ షురా సభ్యులను పరిపాలన విభాగంలో నియమించుకోవటం..ఒమన్ పునర్నిర్మాణానికి అడుగులు పడ్డాయని పేర్కొంది. అలాగే మజ్లిస్, ప్రభుత్వం మధ్య పరస్పర అవగాహనకు దోడ్పతుందని తెలిపింది. అంతేకాదు..ప్రభుత్వంలో మహిళా మంత్రులకు, పరిపాలన విభాగంలో మహిళా అధికారులకు స్థానం కల్పించటాన్ని మజ్లిస్ కొనియాడింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







