విద్యుత్ కేంద్రంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన హోం మంత్రి

- August 22, 2020 , by Maagulf
విద్యుత్ కేంద్రంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన హోం మంత్రి

తెలంగాణ:నాగర్ కర్నూల్ జిల్లాలోని  విద్యుత్ ఉత్పత్తి  కేంద్రం ప్రమాదంలో మరణించిన అసిస్టెంట్ ఇంజనీర్ ఉజ్మా ఫాతిమా మరియు  డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్ గౌడ్ ఇళ్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి శనివారం నాడు సందర్శించారు. హోం మంత్రి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ....., శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం  వద్ద ఊహించని  ప్రమాదం జరిగిందన్నారు. ఆజంపురాలో ఉజ్మా ఫాతిమా తన పొరుగువారని ఆయన అన్నారు. రెండేళ్ల క్రితం ఉజ్మా ఫాతిమా ఉద్యోగానికి ఎంపికైన తర్వాత తనను కలిశారని హైదరాబాద్ లేదా సమీప ప్రాంతంలో పనిచేయాలనుకున్నారని తెలిపారు. దీనిపై తాను  మొదట ఉద్యోగంలో చేరమని సూచించా నన్నారు. ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డిప్యూటీ ఇంజనీర్ కుటుంబానికి రూ .50 లక్షలు, అసిస్టెంట్ ఇంజనీర్ల కుటుంబాలకు రూ .25 లక్షలు ప్రకటించారని మరియు మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com