డిజిటల్ పౌర గుర్తింపు కార్డు జారీ ప్రక్రియ నిలిచిపోలేదు..కువైట్ క్లారిటీ
- August 23, 2020
కువైట్ సిటీ:పౌరుల గుర్తింపు కార్డులను డిజిటలైజ్ చేస్తున్న కువైట్ ప్రభుత్వం..డిజిటల్ సివిల్ ఐడీల జారీపై ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి సంబంధించి స్పష్టత ఇచ్చింది. గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. అయితే..ప్రస్తుతం కొత్త దరఖాస్తులను మాత్రం స్వీకరించటం లేదని కూడా వెల్లడించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల కారణంగా కొత్త దరఖాస్తుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు గత శుక్రవారమే కువైట్ పౌర సమాచార అధికార విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది డిజిటల్ సివిల్ ఐడీల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాళ్లందరికీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. ఇదిలాఉంటే..డిజిటల్ గుర్తింపు కార్డులను కువైట్ పౌరులు అందరూ తీసుకోవాలని..డిజిటల్ ఐడీల ద్వారా గుర్తింపు కార్డు కాపీలు మీ దగ్గర లేకున్నా..మొబైల్ లో ఉండే డిజిటల్ సివిల్ ఐడీలతో ఏ ప్రభుత్వ శాఖలో అయిన పలు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







