డిజిటల్ పౌర గుర్తింపు కార్డు జారీ ప్రక్రియ నిలిచిపోలేదు..కువైట్ క్లారిటీ
- August 23, 2020
కువైట్ సిటీ:పౌరుల గుర్తింపు కార్డులను డిజిటలైజ్ చేస్తున్న కువైట్ ప్రభుత్వం..డిజిటల్ సివిల్ ఐడీల జారీపై ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి సంబంధించి స్పష్టత ఇచ్చింది. గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. అయితే..ప్రస్తుతం కొత్త దరఖాస్తులను మాత్రం స్వీకరించటం లేదని కూడా వెల్లడించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల కారణంగా కొత్త దరఖాస్తుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు గత శుక్రవారమే కువైట్ పౌర సమాచార అధికార విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది డిజిటల్ సివిల్ ఐడీల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాళ్లందరికీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. ఇదిలాఉంటే..డిజిటల్ గుర్తింపు కార్డులను కువైట్ పౌరులు అందరూ తీసుకోవాలని..డిజిటల్ ఐడీల ద్వారా గుర్తింపు కార్డు కాపీలు మీ దగ్గర లేకున్నా..మొబైల్ లో ఉండే డిజిటల్ సివిల్ ఐడీలతో ఏ ప్రభుత్వ శాఖలో అయిన పలు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







