ఒమన్ లో కొత్తగా 740 కరోనా కేసులు..వైరస్ తో 28 మంది మృతి

- August 24, 2020 , by Maagulf
ఒమన్ లో కొత్తగా 740 కరోనా కేసులు..వైరస్ తో 28 మంది మృతి

మస్కట్:ఒమన్ లో కొత్తగా మరో 740 మంది కరోనా బారిన పడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా 28 మంది చనిపోయినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 84,509కి పెరిగింది. అలాగే మృతుల సంఖ్య 637కి పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవటంతో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. సూప్రీం కమిటీ సూచనల మేరకు అందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించటంతో పాటు..ఫేస్ మాస్కులు ధరించాలని హెచ్చరించింది. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి వెళ్లకూడదని తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com