భారత్ లో 58వేలు దాటిన కరోనా మరణాలు
- August 25, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగూతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 60,975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,67,324కు పెరిగింది. ఈ మేరకు మంగళవారం ఉదయం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో కొత్తగా 848 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 58,390కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 24, 04, 585గా ఉంది. దేశంలో ప్రస్తుతం 7,04,348 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 3.5 కోట్ల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. సోమవారం ఒకే రోజు 9.25లక్షలకుపైగా పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇందుకు టెస్ట్ ట్రాక్ ట్రీట్ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వివరించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!