'పుల్వామా' ఛార్జిషీట్లో మసూద్ అజర్ పేరును చేర్చిన ఎన్ఐఏ
- August 25, 2020
న్యూఢిల్లీ: పుల్వామా దాడి కేసులో జైషే మహ్మద్ చీఫ్, ఉగ్రవాది మసూద్ అజర్తో పాటు ఆయన సోదరుడు రౌఫ్ అస్గర్ పేరును జాతీయ దర్యాప్తు బృందం చార్జిషీట్లో చేర్చింది. పుల్వామా దాడికి వీరిద్దరే ప్రధాన సూత్రధారులంటూ ఎన్ఐఏ ఆ ఛార్జిషీట్లో పేర్కొంది. 5,000 పేజీలతో కూడిన ఛార్జిషీట్ను జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) మంగళవారం జమ్మూ కోర్టులో సమర్పించనుంది. అత్యంత ఘోరకమైన ఉగ్రదాడులకు ఎలాంటి ప్రణాళిక రచించారు? పాక్ నుంచి ఎలా అమలు చేశారో అధికారులు క్షుణ్ణంగా వివరించారు.
అంతేకాకుండా జైషే మహ్మద్కు చెందిన 20 మంది ఉగ్రవాదులకు ఈ దాడికి అవసరమైన ఆయుధాలను సమకూర్చారని ఛార్జిషీట్లో తెలిపింది. వీటన్నింటికీ అవసరమైన పూర్తి ఆధారాలను కూడా ఎన్ఐఏ బృందం కోర్టుకు సమర్పించనుంది. వాట్సాప్ చాటింగ్, ఫొటోలు, ఆర్డీఎక్స్ రవాణాకు సంబంధించిన ఫొటోలు, ఫోన్ కాల్స్ డేటా... ఇలా కీలక ఆధారాలను ఎన్ఐఏ అధికారులు కోర్టుకు నివేదించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







