ఇండియాలో మృతి చెందిన బహ్రెయిన్‌ స్టాఫ్‌ నర్స్‌

- August 25, 2020 , by Maagulf
ఇండియాలో మృతి చెందిన బహ్రెయిన్‌ స్టాఫ్‌ నర్స్‌

మనామా: హమాద్‌ టౌన్‌లోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ సెంటర్‌లో స్టాఫ్‌ నర్స్‌గా పనిచేస్తోన్న మలయాళీ మహిళ భవ్య, క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయారు. చెంగనూర్‌లోని అలప్పుజాకి చెందినవారు భవ్య. ట్రీట్‌మెంట్‌ నిమిత్తం బహ్రెయిన్‌ నుంచి సొంత ప్రాంతానికి చేరుకున్న భవ్య ఆరోగ్యం కాస్త మెరుగు పడింది. అనంతరం ఆమె బహ్రెయిన్‌కి చేరుకున్నారు. కానీ, అనూహ్యంగా మళ్ళీ ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ట్రీట్‌మెంట్‌ నిమిత్తం స్వదేశానికి వెళ్ళడం జరిగింది. రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌, తిరువనంతపురంలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. భవ్యకు భర్త మనోజ్‌, తొమ్మిదేళ్ళ కుమార్తె వున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com