అబుధాబిలో 520 బస్సుల్లో ఇంటర్నెట్ ఉచితం
- August 25, 2020
అబుధాబిలో 520 బస్సుల్లో ప్రయాణించేవారికి ఉచిత ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి) ఈ మేరకు తొలి ఫేజ్ ప్రాజెక్టుని పూర్తి చేసింది. అన్ని పబ్లిక్ బస్సుల్లోనూ వైఫై ద్వారా ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టారు. తొలి ఫేజ్లో మొత్తం 520 బస్సుల్లో 410 అబుదాబీ సిటీలోనూ, మరో 110 బస్సులు అల్ అయిన్ సిటీలోనూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందుతున్నాయి. ‘డు’ సంస్థతో ఐటిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం పెంచేలా తెచ్చిన మార్పుల్లో ఇదీ ఓ భాగం. బస్ షెల్టర్లు అలాగే మెయిన్ బస్టాండ్లలోనూ వైఫై అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?