ఒమన్ విడిచి 6 నెలలు దాటినా తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక వెసులుబాటు
- August 25, 2020
మస్కట్:ఒమన్ రెసిడెన్సీ వీసాదారులు దేశం విడిచి 6 నెలలు దాటినా..కొన్ని ప్రత్యేక మినహాయింపులతో తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పించింది ఆ దేశ ప్రభుత్వం. రాయల్ ఒమన్ పోలీసుల నుంచి మినహాయింపు పొందినట్లు అనుమతి పొంది తిరిగి రావొచ్చని స్పష్టం చేసింది. సుల్తానేట్ వెలుపల ఉండి 180 రోజులు దాటితే యజమానిగానీ, కార్మికులుగానీ మినహాయింపు పొందేందుకు పాస్ పోర్ట్, రెసిడెన్సీ సాధారణ పరిపాలనా విభాగంలోని ఆర్ధిక వ్యవహారాలు, పరిపాలన విభాగం అధికారులకు ముందుగా ఓ దరఖాస్తు చేసుకోవాలి. అయితే..దరఖాస్తుదారుడి పాస్ పోర్టు ఖచ్చితంగా ఇంకా చెల్లుబాటులో ఉండాలి. పాస్ పోర్టు కాపీ లేదా యజమానిగానీ, కార్మికుడికి చెందిన ఐడీ కార్డు కాపీ జతపర్చాలి. వాణిజ్య రిజిస్ట్రేషన్ పేపర్ కాపీ, కంపెనీ అధికారిక ముద్రతో కూడిన కాపీని దరఖాస్తుతో జతపరచాల్సి ఉంటుంది. వీటికితోడు 14 రోజుల తర్వాత తిరిగి వెళ్లేందుకు వీలుగా తీసుకునన రిటర్న్ టికెట్ ను కూడా జతపరచాల్సి ఉంటుంది. కోవిడ్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులు తిరిగి వచ్చేందుకు వీలుగా ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







