హైదరాబాద్: రూ.4 కోట్ల నిధులు సమీకరించిన ఫ్రీ హిట్ ఫాంటసీ
- August 25, 2020
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ 'ఫ్రీ హింట్ ఫాంటసీ' తమ వ్యాపార విస్తరణకు రూ.4 కోట్ల నిధులను సమీకరించింది. ఈ మొత్తాన్ని కంపెనీ అభివృద్ధికి వినియోగించి 2021 నాటికి 10 మిలియన్ల మంది వినియోగదారులను చేరువయ్యేలా వినియోగించనుంది. ఫ్రీ హింట్ ఫాంటసీ గేమింగ్ అప్లికేషన్ ఈ నెల 30 నుంచి ఐఓఎస్, ఆండ్రాయిడ్, వెబ్ లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే.. దేశంలోనే తొలిసారిగా కేవలం ఒక్క రూపాయితోనే ఖచ్చితమైన బహుమతులు గెలుచుకునేలా ఫాంటసీ గేమింగ్ అప్లికేషన్ వినియోగదారులను ఆకర్షించనుంది. పలు రాష్ట్రాల్లో విస్తరించేందుకు వీలుగా ప్రస్తుతానికి 8 భాషలలో అప్లికేషన్ రూపొందించారు. ఇదిలాఉంటే హైదరాబాద్ కు చెందిన ప్రత్యూష్ చౌదరి, తరుణ్ వర్మ దండు, రమణ కొవెలముడి ఫ్రీ హింట్ ఫాంటసీని స్థాపించారు. ఓ గేమింగ్ అప్లికేషన్స్ లో తెలుగు రాష్ట్రాల్లో ఇంతలా నిధులు సమీకరించిన తొలి కంపెనీ ఇదే కావటం విశేషం. అయితే..2023 నాటికి గేమింగ్ కంపెనీ 119 బిలియన్ల మార్కెట్ కు ఎదుగుతుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!