వలసదారుల ఎంప్లాయీ ట్రాన్స్‌ఫర్‌ ఫీజు ఎగ్జంప్షన్‌ పీరియడ్‌ ప్రకటన

- August 26, 2020 , by Maagulf
వలసదారుల ఎంప్లాయీ ట్రాన్స్‌ఫర్‌ ఫీజు ఎగ్జంప్షన్‌ పీరియడ్‌ ప్రకటన

మనామా:వర్క్‌ పర్మిట్‌ గడువు ముగిసేలోపు ఓ ఎంప్లాయర్‌ నుంచి మరో ఎంప్లాయర్‌కి మారే అవకాశాన్ని సస్పెండ్‌ చేసింది ఎల్‌ఎంఆర్‌ఎ. ఈ నేపథ్యంలో, వలస కార్మికుడ్ని మార్చే క్రమంలో ప్రస్తుత ఎంప్లాయర్‌, పర్మిట్‌ క్యాన్సిలేషన్‌ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవాలి. తద్వారా కొత్త ఎంప్లాయర్‌, కొత్త వర్క్‌ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఎంప్లాయర్‌, మొదటి ఎంప్లాయర్‌కి మిగతా ఫీజుని చెల్లించాల్సి వుంటుంది. జులై 1, 2020 నుండి సెప్టెంబర్‌ 30 వరకు మాత్రమే ఇది అందుబాటులో వుంటుందనీ, ఎల్‌ఎంఆర్‌ఎ క్లయింట్‌ సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌కి సంబంధిత వివరాలు తెలపాలనీ, ఎలాంటి డిస్‌ ఎగ్రిమెంట్స్‌ వున్నా ఇ-టికెట్‌ని ఇ-సపోర్ట్‌ సిస్టం ద్వారా సమర్పించాలని అధికారుఉల సూచించారు. వలసదారుడ్ని మరో బ్రాంచ్‌కి సేవ్‌ు బేస్‌ సిఆర్‌ ప్రాసెస్‌ ద్వారా పంపాలనుకుంటే, ముందస్తుగా అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. ఈ మేరకు ఎల్‌ఎంఆర్‌ఎని సందర్శించడం లేదా ఇ-టికెట్‌ని ఇ-సపోర్ట్‌ సిస్టంకి సమర్పించడం చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com