డీప్‌ కోమాలోకి ప్రణబ్‌ ముఖర్జీ

- August 26, 2020 , by Maagulf
డీప్‌ కోమాలోకి ప్రణబ్‌ ముఖర్జీ

న్యూ ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. తాజాగా ఆయన తీవ్ర (డీప్‌)కోమాలోకి వెళ్లిపోయారని, వెంటిలేటర్ మద్దతుతో కృత్రిమ శ్వాస అందజేస్తున్నామని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ దవాఖాన బుధవారం తెలిపింది. మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో 16 రోజులుగా ప్రణబ్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉండడం వల్ల ప్రణబ్‌కు చికిత్స అందజేస్తున్నామని, నిన్నటి నుంచి ఆయన మూత్రపిండాలు కూడా క్షీణిస్తున్నట్లు కనబడుతోందని వైద్యులు తెలిపారు. ఆగస్టు 10న ప్రణబ్‌కు అత్యవసర శస్త్రచికిత్స జరిగిన తరువాత ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య స్థితిలో ఎలాంటి మార్పు ఉండడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com