కువైట్ లో ఉన్న ప్రవాసీయులు, పర్యాటకుల వీసా గడువు 3 నెలలు పెంపు
- August 27, 2020
కువైట్ సిటీ:ఆగస్ట్ చివరి నాటికి వీసా గడువు ముగిసే వారికి గుడ్ న్యూస్ అందించింది కువైట్ ప్రభుత్వం. ప్రవాసీయులు, పర్యాటకులకు సంబంధించి రెసిడెన్సీ, వీసా గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే..ఈ వెసులుబాటు కేవలం కువైట్ లో ఉన్నవారికి మాత్రమే అని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఆగస్ట్ 31 నాటికి గడువు ముగిసే వీసాలు నవంబర్ 30 వరకు చెల్లుబాటులో ఉంటాయి. అయితే..ఈ లోగానే ప్రవాసీయుల స్పాన్సర్లు, యజమానులు వారి వీసాలను రెన్యూవల్ చేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఆన్ లైన్ ద్వారాగానీ, రెసిడెన్సీ వ్యవహారాల కార్యాలయాల్లోగానీ వీసాలను రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు దేశంలో చిక్కుకుపోయిన పర్యాటకులు సైతం నవంబర్ 30 నాటికి తిరుగు ప్రయాణంలో అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







