కువైట్ లో ఉన్న ప్రవాసీయులు, పర్యాటకుల వీసా గడువు 3 నెలలు పెంపు
- August 27, 2020
కువైట్ సిటీ:ఆగస్ట్ చివరి నాటికి వీసా గడువు ముగిసే వారికి గుడ్ న్యూస్ అందించింది కువైట్ ప్రభుత్వం. ప్రవాసీయులు, పర్యాటకులకు సంబంధించి రెసిడెన్సీ, వీసా గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే..ఈ వెసులుబాటు కేవలం కువైట్ లో ఉన్నవారికి మాత్రమే అని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఆగస్ట్ 31 నాటికి గడువు ముగిసే వీసాలు నవంబర్ 30 వరకు చెల్లుబాటులో ఉంటాయి. అయితే..ఈ లోగానే ప్రవాసీయుల స్పాన్సర్లు, యజమానులు వారి వీసాలను రెన్యూవల్ చేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఆన్ లైన్ ద్వారాగానీ, రెసిడెన్సీ వ్యవహారాల కార్యాలయాల్లోగానీ వీసాలను రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు దేశంలో చిక్కుకుపోయిన పర్యాటకులు సైతం నవంబర్ 30 నాటికి తిరుగు ప్రయాణంలో అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!