తెలంగాణలో 2,795 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు

- August 27, 2020 , by Maagulf
తెలంగాణలో 2,795 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు

హైదరాబాద్‌:తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉధృతంగానే ఉంది.గడిచిన 24 గంటల్లో 2,795 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,483కి చేరింది.ఇందులో 86,095 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27,600 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 778కి చేరింది.

ఇక కేసుల వివరాలు GHMC పరిధిలో 449, భద్రాద్రి కొత్త గూడెంలో 72, జగిత్యాలలో 89, కరీంనగర్ లో 136, ఖమ్మంలో 152, మంచిర్యాలలో 106, మహబూబాబాద్ జిల్లాలో 102, నల్గొండలో 164, నిజామాబాద్ లో 112, పెద్దపల్లిలో 77, రంగారెడ్డి జిల్లాలో 268, సిద్ధిపేట జిల్లాలో 113, సూర్యాపేటలో 86, వరంగల్ అర్బన్ లో 132 కేసులు నమోదయ్యాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com