రియాద్ లో SR 8,00,000 విలువైన కేబుల్స్ చోరీకి పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్
- August 27, 2020
రియాద్:సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రియాద్ లో SR 8,00,000 విలువైన ఎలక్ట్రిక్ కేబుల్స్, ఎలక్ట్రిసిటి కట్టర్స్ ను దొంగిలించిన కేసులు ఈ ముఠా సభ్యులను పట్టుకున్నారు. సుడాన్ కు చెందిన ఏడుగురు సభ్యుల ముఠా రియాద్ లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. గోడౌన్లను లక్ష్యంగా చేసుకొని ఇప్పటివరకు 24 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. దొంగిలించిన వైర్లను తూర్పు రియాద్ లోని ఓ ప్రాంతంలో జమచేసి వాటి నుంచి రాగిని తీసి అమ్ముకుంటారని పోలీసులు వివరించారు. ఇదిలాఉంటే మరో ఘటనలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఐదురుగు అఫ్రికన్లను అరెస్ట్ చేసినట్లు రియాద్ పోలీసులు స్పష్టం చేశారు. అరెస్టైన వారిలో ఓ మహిళ కూడా ఉంది. వారి నుంచి 81 బ్యారెల్స్ అల్కాహాల్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సౌదీ అరేబియా చట్టాల మేరకు అక్రమంగా మద్యం తయారు చేయటం, అమ్మటం నిషేధమని...అలాంటివారి పట్ట కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







