రియాద్ లో SR 8,00,000 విలువైన కేబుల్స్ చోరీకి పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్
- August 27, 2020
రియాద్:సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రియాద్ లో SR 8,00,000 విలువైన ఎలక్ట్రిక్ కేబుల్స్, ఎలక్ట్రిసిటి కట్టర్స్ ను దొంగిలించిన కేసులు ఈ ముఠా సభ్యులను పట్టుకున్నారు. సుడాన్ కు చెందిన ఏడుగురు సభ్యుల ముఠా రియాద్ లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. గోడౌన్లను లక్ష్యంగా చేసుకొని ఇప్పటివరకు 24 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. దొంగిలించిన వైర్లను తూర్పు రియాద్ లోని ఓ ప్రాంతంలో జమచేసి వాటి నుంచి రాగిని తీసి అమ్ముకుంటారని పోలీసులు వివరించారు. ఇదిలాఉంటే మరో ఘటనలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఐదురుగు అఫ్రికన్లను అరెస్ట్ చేసినట్లు రియాద్ పోలీసులు స్పష్టం చేశారు. అరెస్టైన వారిలో ఓ మహిళ కూడా ఉంది. వారి నుంచి 81 బ్యారెల్స్ అల్కాహాల్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సౌదీ అరేబియా చట్టాల మేరకు అక్రమంగా మద్యం తయారు చేయటం, అమ్మటం నిషేధమని...అలాంటివారి పట్ట కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!