రియాద్ లో SR 8,00,000 విలువైన కేబుల్స్ చోరీకి పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్
- August 27, 2020
రియాద్:సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రియాద్ లో SR 8,00,000 విలువైన ఎలక్ట్రిక్ కేబుల్స్, ఎలక్ట్రిసిటి కట్టర్స్ ను దొంగిలించిన కేసులు ఈ ముఠా సభ్యులను పట్టుకున్నారు. సుడాన్ కు చెందిన ఏడుగురు సభ్యుల ముఠా రియాద్ లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. గోడౌన్లను లక్ష్యంగా చేసుకొని ఇప్పటివరకు 24 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. దొంగిలించిన వైర్లను తూర్పు రియాద్ లోని ఓ ప్రాంతంలో జమచేసి వాటి నుంచి రాగిని తీసి అమ్ముకుంటారని పోలీసులు వివరించారు. ఇదిలాఉంటే మరో ఘటనలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఐదురుగు అఫ్రికన్లను అరెస్ట్ చేసినట్లు రియాద్ పోలీసులు స్పష్టం చేశారు. అరెస్టైన వారిలో ఓ మహిళ కూడా ఉంది. వారి నుంచి 81 బ్యారెల్స్ అల్కాహాల్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సౌదీ అరేబియా చట్టాల మేరకు అక్రమంగా మద్యం తయారు చేయటం, అమ్మటం నిషేధమని...అలాంటివారి పట్ట కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







