చెన్నై సూపర్ కింగ్స్లో పలువురికి కరోనా: క్వారంటైన్లోకి ధోనీ టీమ్
- August 28, 2020యూఏఈ: ఐపీఎల్లో పాల్గొనేందుకు యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం రేపింది. అక్కడ నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో కొందరు ఆటగాళ్లకు పాజిటివ్గా తేలింది. యూఏఈకి వెళ్లిన జట్టు సభ్యులకు నిబంధనల ప్రకారం.. ఒకటి, మూడు, ఆరో రోజున టెస్టులు నిర్వహించారు. ఆ టెస్టుల్లో కొంతమంది జట్టు సభ్యులకు పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో చెన్నై జట్టుకు క్వారంటైన్ పీరియడ్ను మళ్లీ పొడిగించారు. సెప్టెంబర్ 1 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు క్వారంటైన్లో ఉండనుంది. బీసీసీఐ ఇప్పటి వరకు ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించలేదు. ఇప్పటికే ముందుగా యూఏఈ వెళ్లిన జట్లు ప్రాక్టీస్ను మొదలుపెట్టాయి.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత